
నాణ్యమైన పాలే సేకరించాలి
కడ్తాల్: పాడి రైతుల నుంచి నాణ్యమైన పాలు సేకరించాలని తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య (టీజీడీడీసీఎఫ్) చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత సూచించారు. కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని సొసైటీల అధ్యక్షులు, వేతన కార్యదర్శులతో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయ డెయిరీ ద్వారా సేకరించే పాలు నాణ్య త ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నా రు. పాలు నాణ్యంగా ఉంటేనే వినియోగదారుల మెప్పు పొందగలమని చెప్పారు. కడ్తాల్ పాల శీతలీకరణ కేంద్రం పరిధి నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా నిత్యం 30 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఇందులో 3.5, 3.6 ప్యాట్ మాత్రమే ఉంటోందన్నారు. వీటిని బయట మార్కెటింగ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పాడి ఆవులు, గేదెలకు సరైన దాణా అందించాలని సూచించారు. ఇకనుంచి 8.3నుంచి 8.5 ఎస్ఎన్ఎఫ్ ఉండేలా చూడాలన్నారు. 8.3 కన్నా త క్కువగా ఉన్న పాలు సేకరణకు యోగ్యం కా వని స్పష్టంచేశారు. పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బాబు బేరి మాట్లాడుతూ.. పాడి పోషణ, పశువులకు అందించాల్సిన పోషకాహారం, పాల నాణ్యతకు సంబంధించిన అంశాలను సమగ్రంగా వివరించారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మురళి మాట్లాడుతూ.. పాల సేకరణ, నాణ్యత, నిల్వ, రవాణా అంశాలపై అగవాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ మేనేజర్ ఉదయశ్రీ, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేశ్, వివిధ పాల కేంద్రాల సోసైటీ అధ్యక్షులు, పెయిడ్ సెక్రటరీలు, రైతులు, డెయిరీ సిబ్బంది ఉన్నారు.
టీజీడీడీసీఎఫ్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత
కడ్తాల్లో పాడి రైతులకు
అవగాహన సమావేశం