
రైతులందరికీ భరోసా అందిస్తాం
● జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.127.79 కోట్లు
● జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు
షాద్నగర్రూరల్: జిల్లాలోని రైతులందరికీ రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్కు సంబంధించి ఈ నెల 16, 17న జిల్లా వ్యాప్తంగా 1,87,255 మంది రైతులకుగాను రూ.127.79 కోట్ల రైతు భరోసా సాయం అందిచామన్నారు. కొత్త పాస్బుక్ ఉన్న రైతులు బ్యాంక్ ఖాతా వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయ అధికారికిగానీ అందజేయాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుగా ఉండి రైతు భరోసా సహాయం అందని రైతులు వారి ఖాతా వివరాలను మండల వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలని కోరారు.