
గిరిజనుల స్థితిగతులపై సర్వే
కడ్తాల్: గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. ధరి ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్లో భాగంగా మంగళవారం మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాడ్యతండా, నేరేళ్లకోలుతండా, చెన్నారంతండా, సాలార్పూర్ గ్రామ పంచాయతీలలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహించి వారి స్థితిగతులపై సర్వే చేశారు. విద్యుత్, మరుగుదొడ్లు, అసైన్డ్ భూములు, సాగు వివరాలు, వైద్య సేవలు, అంతర్గత రహదారుల వివరాలు తెలుసుకుని నమోదు చేసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధికి కోసం ధరి ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద కృషి చేయనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రాములు, సర్వే అధికారి బీమ్లానాయక్ ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.