
భూ భారతితో రైతులకు విముక్తి
శంకర్పల్లి: ధరణితో గత పదేళ్లుగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అది ఒక నల్ల చట్టమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని మహాలింగాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు నరకం అనుభవించారని, దానిని తొలగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. గతంలో అధికారులు గ్రామాల్లోకి వచ్చేవారు కాదని, రైతు ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదని గుర్తుచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేందర్, ఆర్ఐ సుప్రి యా, పీఏసీఎస్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి, నాయకులు గోపాల్రెడ్డి, లింగారెడ్డి, చంద్రయ్య, రఘునందన్రెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యాదయ్య