న్యూస్రీల్
సంజీవని పేరుతో బాబు కొత్త డ్రామా నిరుపయోగంగా విలేజ్ క్లినిక్ భవనాలు వైద్యులు, వైద్య పరికరాల కొరతతో అవస్థలు చిన్నపాటి రోగానికి పక్క జిల్లాలకు పరుగులు తీస్తున్న పశ్చిమ ప్రజలు పశ్చిమానికి గుండెలాంటి మెడికల్ కాలేజీని ప్రైవేటుకు ధారాదత్తం పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్య దూరం సమస్యలను గాలికొదిలేసి నేడు గిద్దలూరులో సంజీవని పథకం ప్రారంభించేందుకు వస్తున్న చంద్రబాబు
రెండేళ్లుగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సంజీవని పేరుతో కొత్త డ్రామాలకు తెరదీశారు. నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు స్పెషాలిటీ వైద్యం,పేద బిడ్డలకు వైద్య విద్యను అందించే మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు మొదలుపెట్టారు. నిరుపేదలకు ఆరోగ్య భరోసా ఇస్తున్న ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. విలేజీ క్లినిక్లకు తాళం వేసేసి సంజీవనితో ప్రపంచస్థాయి వైద్యసేవలు ప్రజలకు అందిస్తామని గొప్పలు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త వైద్యం..
పాత చికిత్స!


