గుట్టుచప్పుడు కాకుండా ఎంఐజీ లేఅవుట్లో ప్లాట్లను పంచుకున్న టీడీపీ నేతలు పేరుకే ఆన్లైన్ బిడ్డింగ్...టీడీపీ కార్యాలయంలో రహస్యంగా ప్లాట్ల బుకింగ్ ఒక్కొక్క నాయకుడి ఖాతాలోకి ఐదారు వరకు ప్లాట్లు కార్నర్ ప్లాట్లు, నార్త్ఈస్టు కార్నర్ ప్లాట్లు అన్నీ టీడీపీ నేతలకు సంపూర్ణ సహకారం అందించిన నుడా అధికారులు దాదాపు 90 ప్లాట్ల వరకు అధికార పార్టీ ముఠాకు కట్టబెట్టిన వైనం తరువాత బిడ్డింగ్లో అందరికి తెలిసేలా ప్రచారం చేస్తామంటూ నుడా అధికారుల తాజా ప్రకటన విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్న సాధారణ ప్రజలు
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏవిధంగా దోపిడీ చేయవచ్చో కందుకూరు టీడీపీ నేతలను చూసి నేర్చుకోవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కందుకూరు పట్టణంలోని ఏంఐజీ (మిడిల్ ఇన్కమ్ గ్రూపు) లేవుట్లో ప్లాట్ల (ఇంటి స్థలం)లో జరిగిన దోపిడీ వ్యవహారమే. ఆన్లైన్ విధానంలో బహిరంగంగా ప్రజలందరికీ తెలిసేలా సాగాల్సిన ప్లాట్ల విక్రయాన్ని గట్టుచప్పుడు కాకుండా టీడీపీ కార్యాలయం వేదికగా టీడీపీ నేతలు పంచేసుకున్నారు. నుడా అధికారుల నుంచి సంపూర్ణ సహకారం ఉండడంతో ఈ దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది. ప్రస్తుతం విషయం బయటకు పొక్కడంతో పట్టణ ప్రజలు అవాక్కవుతున్నారు.
ప్లాట్లలో పాగా


