సాయం చేసేవారిని గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

సాయం చేసేవారిని గుర్తించాలి

Jun 27 2025 4:47 AM | Updated on Jun 27 2025 4:47 AM

సాయం చేసేవారిని గుర్తించాలి

సాయం చేసేవారిని గుర్తించాలి

ఒంగోలు సబర్బన్‌: పీ–4 సర్వేలో గుర్తించిన కుటుంబాలకు సాయం చేసేవారిని సంప్రదించాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ ఏ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్దన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా హోదాతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారంతా బంగారు కుటుంబాలను (పీ–4 సర్వేలో తేల్చిన కుటుంబాలు) దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సదరు ఉద్యోగి, అధికారి బదిలీ అయినప్పటికీ ఆ హోదాలోకి వచ్చినవారు ఆయా కుటుంబాల యోగక్షేమాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. వెట్టి చాకీరి నుంచి విముక్తి పొందిన కుటుంబాలను తాను దత్తత తీసుకుని ఈ పథకం కింద వారికి తాను మార్గదర్శిగా ఉండాలని నిర్ణయించుకున్నానని కలెక్టర్‌ వెల్లడించారు. మార్గదర్శిగా ఉండటంలోనూ, మార్గదర్శకులను గుర్తించడంలోనూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 74 వేలకుపైగా బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరి అవసరాలను గుర్తించడంతోపాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా త్వరగా గుర్తించాలన్నారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలన్నారు. ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చని, బంగారు కుటుంబం, మార్గదర్శకుల వివరాలను వెబ్‌సైట్లో ఏ విధంగా నమోదు చేయాలో జెడ్పీ సీఈవో చిరంజీవి వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్‌ఓ బి.చినఓబులేసు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, డీఎం అండ్‌ హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ ఎస్‌.శ్రీనివాస నాయక్‌, డీఎస్‌ఓ పద్మశ్రీ, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జగన్నాథరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అర్జున్‌ నాయక్‌, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బాలశంకర్రావు, జిల్లా బీసీ సక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ వరలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

పీ–4 పథకానికి ఎన్‌ఆర్‌ఐలు, ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించాలి

మార్గదర్శకులను గుర్తించడంలో అధికారులు వేగం పెంచాలి

అధికారులు కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement