
ఆగని పచ్చమూకల ఆగడాలు
మర్రిపూడి:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు శృతిమించుతున్నాయి. గ్రామ కంఠ భూమిని తెలుగుదేశం సానుభూతిపరులు యథేచ్ఛగా ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వెంకటకృష్ణాపురం సర్వే నంబర్ 15లో 9.92 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. అందులో 0.51 సెంట్ల భూమిలో అదే గ్రామానికి చెందిన బొట్లగుంట సత్యన్నారాయణ, బొట్లగుంట వెంకట కృష్ణయ్య కుమారులు శ్రీను, తిరుపాలు కొన్ని దశాబ్దాలుగా గడ్డివాములు, పశువులు, గేదెలను మేపుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొండూరి వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీను గ్రామకంఠాన్ని ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నాడు. ఆ గ్రామ కంఠం భూమిపై టీడీపీ శ్రేణుల కన్ను పడిందని, ఆక్రమించేందుకు గుంటలు తీస్తున్న తురుణంలో ఈ నెల 16న గ్రామకంఠంస్వాహా అనే శీర్షికను సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. అయినా అధికారులు, పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతగురువారం గ్రామ కంఠం భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు పిల్లర్లు తీసి అడ్డబీములు సైతం వేస్తున్నారు. పిల్లర్లు, అడ్డబీములు పోసేందుకు గ్రామంలో కూలీలు ఎవరు రాకపోవడంతో పక్క ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్న విషయం తెలుసుకున్న హక్కుదారులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో మహిళ కింద పడిపోయింది. ఈ పరిస్థితుల్లో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తరాల నుంచి అనుభవిస్తున్న నా భూమిని కొండూరి వెంకటేశ్వర్లు, కొండూరి శ్రీనులు దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్నారని, విచారించి తగు న్యాయం చేయాలంటూ వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన బొట్లగుంట శ్రీను తహసీల్దార్ బి.జనార్ద్కు వినతిపత్రం అందజేశారు.
గ్రామ కంఠాన్ని ఆక్రమించి శాశ్వత కట్టడాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ
అధికారులు
న్యాయం చేయాలని తహసీల్దార్కు
బాధితుల ఫిర్యాదు
అధికారం అండగా పచ్చమూకలు
రెచ్చిపోతున్నాయి. ఆ మూకల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
అన్నీ తెలిసినా అధికారులెవ్వరూ
వారి దౌర్జన్యాలకు అడ్డుకోలేకపోతున్నారు. మండలంలోని వెంకటకృష్ణాపురంలో
గ్రామకంఠం భూములే ఇందుకు ఉదాహరణ. గ్రామకంఠం భూములు ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులెవ్వరూ
ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

ఆగని పచ్చమూకల ఆగడాలు