
ఎస్సీ కార్పొరేషన్ రుణాల రికవరీకి రంగం సిద్ధం
ఒంగోలు వన్టౌన్: ఎస్సీ కార్పొరేషన్ రుణాల రికవరీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు తాడేపల్లి అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జే అర్జున్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సక్రమంగా రుణాలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించలేదన్నారు. దీంతో రుణాల రికవరీకి ఏపీ రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సంఘం లిమిటెడ్ రుణ వసూళ్ల కోసం లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిపారు. దీని ప్రకారం లబ్ధిదారులు వద్ద నుంచి రూ.94 లక్షలు రికవరీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారులకు రుణాల చెల్లింపునకు 60 నెలల గడువు ముగిసిందన్నారు. లబ్ధిదారులు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించి వారు చెల్లించాల్సిన బకాయిలను తెలుసుకుని చెల్లించాలన్నారు.