
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: పోలీస్శాఖ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 65 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పోలీసు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఆయా ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్టప్రకారం విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు ఎస్పీ కార్యాలయం నుంచి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. బాధితులకు చేసిన న్యాయానికి సంబంధించిన నివేదికలను ఎస్పీ కార్యాలయానికి పంపించాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ రమణ కుమార్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్రావు, సిబ్బంది పాల్గొన్నారు.