
ఇంటి పేరు తప్పు పడినందుకు..
తల్లి ఇంటి పేరు తప్పుపడినందుకు ఏలూరివారిపాలెం గ్రామంలో ఒకే ఇంటిలో ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం అనర్హత వేటు పడింది. చీమకుర్తికి చెందిన పేరుబోయిన శ్యామ్ ప్రసాద్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో తన్విక అదే గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి, జాస్మిన్ గొట్లగట్టులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువున్నారు. అయితే శ్యామ్ ప్రసాద్ భార్య భారతికి ఇంటి పేరు ఆమె తల్లిదండ్రుల రేషన్ కార్డులో వడ్లమాను భారతిగా నమోదైంది. ఇటీవల రేషన్ కార్డులో నుంచి భారతి పేరును శ్యామ్ ప్రసాద్ రేషన్ కార్డులోకి మార్చుకోవడానికి చర్యలు తీసుకున్నారు. కానీ ఇంకా రేషన్ కార్డులో పేరు మారకపోవడంతో ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన తల్లికి వందనం లిస్ట్లో శ్యామ్ ప్రసాద్కు చెందిన ఇద్దరు పిల్లల పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.