
విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు
వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మోడల్ స్కూల్, జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలకల పాఠశాలలో భోజనం బాగోలేదని మంత్రి ఎదుటే విద్యార్థులు మొరపెట్టుకున్నారు. అయినా విద్యాశాఖ అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరం. పేద పిల్లలు చదువుకునే పాఠశాలలపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.
– సీహెచ్ పవన్కుమార్,
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు