ఎంసెట్లో రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు సాధించిన షేక్ సూరజ్ ఒంగోలు భాగ్యనగర్ నివాసి. ఇతని తండ్రి దరియాసాహెబ్ ప్రస్తుతం రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. సూరజ్ ఇంటర్ నెల్లూరులోని బ్రహ్మదేవి ఐఐటీ క్యాంపస్లో చదివాడు. జేఈఈ మెయిన్స్లో 300/300 మార్కులతో జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 134వ ర్యాంకును, ఓబీసీ కేటగిరీలో 11వ ర్యాంకు దక్కించుకున్నాడు. తాజాగా ఏపీ ఎప్సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకును, జిల్లాస్థాయిలో 2వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకు జేఈఈ అడ్వాన్స్ ఫలితాల ప్రకారం ఐఐటీ ముంబైలో సీటు వస్తుందని, సీఎస్ఈ గ్రూపు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా సూరజ్ను తల్లిదండ్రులతోపాటు బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment