ఇందాపూర్‌,హెరిటేజ్‌ లింకులపై చర్చించాలి: వైఎస్సార్‌సీపీ | Ysrcp Mlcs Protest In The Legislative Council | Sakshi
Sakshi News home page

ఇందాపూర్‌,హెరిటేజ్‌ లింకులపై చర్చించాలి: వైఎస్సార్‌సీపీ

Feb 20 2026 10:21 AM | Updated on Feb 20 2026 11:13 AM

Ysrcp Mlcs Protest In The Legislative Council

సాక్షి, అమరావతి: మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాద అంశం, హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ, టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం చేశారు. శాసనమండలికి ర్యాలీ వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.. భోలే బాబా.. చంద్రబాబా.. చంద్రబాబా.. ఆలీబాబా అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.

ఇందాపూర్‌, హెరిటేజ్‌ లింకులపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు నిందలు మోపారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవదేవుడి ధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం పెట్టిన డొల్ల బడ్జెట్‌పై చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement