గుంటూరు
న్యూస్రీల్
ఈ సందర్భంగా పెదకాకాని వై–జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, విద్యార్థులు బైక్లపై భారీ ర్యాలీ నిర్వహించగా, పెద్ద ఎత్తున కార్లుతో పార్టీ శ్రేణులు ఎదురేగి స్వాగతం పలికారు.
వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పెదకాకాని ఫ్లై ఓవర్ వద్ద క్రేన్ సహాయంతో అంబటిని భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్, వంగవీటి మోహన రంగా, అంబటి రాంబాబు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
అక్కడ నుంచి ర్యాలీ ఆటోనగర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కూడలి వద్దకు చేరుకుంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో అంబటికి స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి పూలమాలలతో సత్కరించారు.
అనంతరం అక్కడ నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం, హిమని కూల్డ్రింక్ సెంటర్, హిందూ కళాశాల కూడలి మీదుగా నగరంపాలెంలోని మూడుబొమ్మల సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ డివిజన్ అధ్యక్షుడు యాపర్తి కోటి ఆధ్వర్యంలో మహిళలు అంబటికి హారతులు పట్టారు.
నగరంపాలెం మూడుబొమ్మల సెంటర్లోని స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహానికి అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇక జిల్లా కలెక్టరేట్, పట్టాభిపురం రోడ్డు, స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల సెంటర్ మీదుగా ర్యాలీ అంబటి నివాసానికి చేరుకుంది.
అంబటి రాంబాబు రాకతో ఆయన నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంతోషం వెలిబుచ్చారు. పార్టీ నేతలు, కార్య కర్తలు అంబటిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అంబటి రాంబాబును ఆయన నివాసం వద్ద ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పార్టీ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివ కుమార్, వనమా బాలవజ్రబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్కుమార్లు కలిశారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.8300, మోడల్ ధర రూ.7500 వరకు పలికింది.
కొల్లూరు : ముస్లింలు రంజాన్ ఉపవాస
దీక్షలను నియమ, నిష్టలతో ఆరంభించారు. మసీదులను గురువారం విద్యుత్ దీపాలతో అలంకరించారు.
9
భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): అక్రమ కేసులో విడుదలై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు వస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం ఘన స్వాగతం పలికారు.
అంబటిని కలిసిన పార్టీ నేతలు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


