బస్సు ఢీకొని ఒకరి మృతి
అమరావతి: మండలంలోని మునగోడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అమరావతి నుండి క్రోసూరు వెళుతున్న అర్టీసీ బస్సు మునగోడు బస్టాండు సెంటర్ సమీపంలో బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంకు చెందిన పొదిలి నాగరాజు (32) రోడ్డుదాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. సుమారు 50 అడుగుల దూరం ఈడ్చుకుని పోవటంతో నాగరాజు అక్కడిక్కడే మరణించాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అమరావతి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదకారణమైన అర్టీసీ బస్ను అమరావతి పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాని డిమాండ్
సత్తెనపల్లి: కొత్త పెన్షన్ రూల్స్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేవిగా ఉండాలని ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎమ్ సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు కొత్త పెన్షన్ రూల్స్–2026 లో ముసాయిదా విడుదలలో భాగంగా 1980 నుంచి ఉన్న వాటిని కాకుండా, 33 ఏళ్ళ సర్వీసు నిండితే పబ్లిక్ ఇంటరెస్ట్ దృష్ట్యా రిటైరవ్వమని తెలియజేసే అధికారం, జీత నష్టం, సెలవు కాలాన్ని పెన్షన్ లెక్కింపునకు పరిగణనలోకి తీసు కొనబడదనే అంశం ఇబ్బంది కలిగించేలా రూపొందించటం తగదన్నారు. ముసాయిదా నిర్మాణంలో వ్యతిరేక అంశాలను చేర్చితే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పెద్ద ఎత్తున ఉద్యమకార్యాచరణ రూపొందిస్తామన్నారు. కొత్తచట్టాలు, ముసాయిదాలు ఎప్పుడూ పాతవాటికంటే మెరుగ్గా ఉండాలి కాని, ఉన్నవాటిని హరించే విధంగా ఉండకూడదన్నారు.
బాపట్ల: హైడ్రోపోనిక్స్ (మట్టి లేని) సాగు.. నేటి స్మార్ట్, సుస్థిర వ్యవసాయ పద్ధతులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి పేర్కొన్నారు. బాపట్లలోని డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో హైడ్రోపోనిక్స్ మట్టి లేని సాగు నేటి స్మార్ట్, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈశిక్షణ కార్యక్రమంలో డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి మాట్లాడుతూ ఈశిక్షణ శిబిరంలో 13మంది కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొనటం సంతోషకరమన్నారు. రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించటం ఉపయోగకరమన్నారు. హైడ్రోపోనిక్స్ మట్టి లేని సాగు వల్ల తక్కువ నీటి వినియోగంతో పంటను పండించుకోవచ్చని, అందువల్ల రైతులు మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. యూనివర్సిటీ పరిధిలోని 18 కాలేజీలు 33 పరిశోధన కేంద్రాల్లో ఈ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అసోసియేట్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డాక్టర్ ఎ.మణి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివనారాయణ, వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ పి.ప్రసన్న రాణి, అసోసియేట్ డీన్ డాక్టర్ ఈఈ స్మిత్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కృపావతి, డాక్టర్ జి.రవిబాబు, డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ ఎస్.విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.
బస్సు ఢీకొని ఒకరి మృతి
బస్సు ఢీకొని ఒకరి మృతి
బస్సు ఢీకొని ఒకరి మృతి


