బీజేపీ జూటగాళ్ల పార్టీ: జీవన్‌రెడ్డి  | Telangana: MLA Jeevan Reddy Sensational Comments On BJP Party | Sakshi
Sakshi News home page

బీజేపీ జూటగాళ్ల పార్టీ: జీవన్‌రెడ్డి 

Jan 9 2022 2:23 AM | Updated on Jan 9 2022 2:23 AM

Telangana: MLA Jeevan Reddy Sensational Comments On BJP Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ బేరగాళ్లు, జూటగాళ్ల పార్టీలాగా తయారైందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శుక్రవారం తెలంగాణ పర్యటనలో అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాల యంలో శనివారం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వ్యాపమ్‌ కుంభకోణంలో ఆరోపణలున్న చౌహాన్‌.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయ్యారని, నాలుగుసార్లు సీఎం పదవి చేపట్టినా కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్టునైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమ లవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా ల్లో మధ్యప్రదేశ్‌లో ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement