రైతుల పాలిట మిడతల దండు | Telangana: MLA Jeevan Reddy Fires On BJP Leaders | Sakshi
Sakshi News home page

రైతుల పాలిట మిడతల దండు

Nov 17 2021 2:51 AM | Updated on Nov 17 2021 2:51 AM

Telangana: MLA Jeevan Reddy Fires On BJP Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేతలు రైతుల పాలిట మిడతల దం డులా మారారని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్‌ బీజేపీకి అధ్యక్షుడు కాదని, బురద జల్లే పార్టీకి అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ నేడు గూండా సంజయ్‌గా మారారని ధ్వజమెత్తారు.

పంజాబ్‌ తరహాలో ధాన్యం సేకరణ చేయాలని అడిగే రైతుల కల్లాలపై దాడులకు దిగుతున్నారన్నారు. ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదులు చేస్తారా? అని ప్రశ్నించారు.   రైతుల కోసం రూ.3 లక్షల కోట్లు వెచ్చించిన సీఎం కేసీఆర్‌తో పెట్టుకుంటే బీజేపీకి శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement