Parliament:రాజ్యసభ నుంచి మరో ముగ్గురి సస్పెన్షన్‌ | Parliament: 3 more Rajya Sabha members suspended | Sakshi
Sakshi News home page

Parliament:రాజ్యసభ నుంచి మరో ముగ్గురి సస్పెన్షన్‌

Jul 29 2022 5:44 AM | Updated on Jul 29 2022 7:19 AM

Parliament: 3 more Rajya Sabha members suspended - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎగువ సభలో మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. సభలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు సుశీల్‌కుమార్‌ గుప్తా, సందీప్‌కుమార్‌ పాఠక్, స్వతంత్ర సభ్యుడు అజిత్‌కుమార్‌ భూయాన్‌ను ఈ వారమంతా బహిష్కరించారు.

సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేసినందుకు గాను ఈ ముగ్గురిని సస్పెండ్‌ చేయాలంటూ గురువారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ నుంచి సస్పెండైన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 23కు చేరుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement