రెండు లోక్‌సభ సీట్లకు 11 మంది పోటీ! | Manipur Lok Sabha Candidates Full List | Sakshi
Sakshi News home page

Manipur: రెండు లోక్‌సభ సీట్లకు 11 మంది పోటీ!

Apr 4 2024 12:44 PM | Updated on Apr 4 2024 12:59 PM

Manipur Lok Sabha Candidates Full List - Sakshi

మణిపూర్‌ హింసాకాండ తరువాత ఇక్కడ జరుగుతున్న లోకసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్‌లో రెండు లోక్‌సభ స్థానాలు ఉండగా, పలువురు నేతలు ఈ సీట్లపై దృష్టి పెట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాలను బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ గెలుచుకున్నాయి. 

తాజాగా మణిపూర్‌లోని ఇన్నర్‌ స్థానం నుంచి తొంజోమ్‌ బసంత్‌ కుమార్‌ సింగ్‌కు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అంగోమ్చా బిమల్ అకోయిజంపై పోటీకి దిగారు. ఈ స్థానం నుంచి మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఔటర్ మణిపూర్ సీటును ఎన్‌డిఎ మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్)కి ఇచ్చారు. ఎన్‌పిఎఫ్‌కి చెందిన కట్చుయ్ తిమోతీ జిమిక్ కాంగ్రెస్‌కు చెందిన ఆల్‌ఫ్రెడ్ కాన్ నగుమ్ ఆర్థర్‌తో తలపడుతున్నారు. ఇక్కడ మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో పాటు మణిపూర్ పీపుల్స్ పార్టీ, ఆర్పీఐ (అథవాలే), రాష్ట్రీయ జనహిత సంఘర్ష్ పార్టీ, యూనివర్సల్ ఫ్యామిలీ పార్టీ కూడా  పోటీకి దిగాయి.

మణిపూర్‌లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. మణిపూర్ ఇన్నర్ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. మణిపూర్‌లోని ఇన్నర్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌ 17,775 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓయినమ్‌ నబా కిషోర్‌ సింగ్‌పై విజయం సాధించారు. ఎన్‌పీఎఫ్‌ ఔటర్ మణిపూర్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. ఎన్‌పిఎఫ్‌కు చెందిన లోహరో ఎస్ పోస్ 73782 ఓట్లతో కాంగ్రెస్‌కు చెందిన హోలిమ్ సోఖోపావో మేట్‌పై విజయం సాధించారు. మణిపూర్ హింసాకాండ తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలు బీజేపీ కూటమికి అగ్నిపరీక్ష కానున్నాయి. మణిపూర్‌లోని రెండు లోక్‌సభ సీట్లకు 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement