తెలంగాణను టీఆర్‌ఎస్‌ పార్టీ హైజాక్‌ చేసింది.. | BJP Leader Gangadi Krishnareddy Comments On CM KCR In Karimnagar | Sakshi
Sakshi News home page

తెలంగాణను టీఆర్‌ఎస్‌ పార్టీ హైజాక్‌ చేసింది..

Aug 26 2021 1:59 PM | Updated on Aug 26 2021 2:00 PM

BJP Leader Gangadi Krishnareddy Comments On CM KCR In Karimnagar - Sakshi

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

సాక్షి, కరీంనగర్‌టౌన్‌: సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కల్పించి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ పేరుతో హైజాక్‌ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాసంగ్రామ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ భూములు అమ్మి హుజూరాబాద్‌లో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పథకాలు అమలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు.

ప్రజా అవసరాలపై నిరంతరం దృష్టి సారించాల్సిన అధికారులను కార్యకర్తల్లా మార్చుకొని, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో పని చేయిస్తుండటం శోచనీయమన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ, పోలీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఈనెల 28 నుంచి చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

చదవండి: Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement