
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్
గోదావరిఖని/జ్యోతినగర్: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఎస్బీఐ బ్యాంకు రోడ్ నుంచి నర్రాశాలపల్లె ప్రభుత్వ పాఠశాల వరకు నిర్మించనున్న రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే జంగాలపల్లె, మల్కాపూర్, నర్రాశాలపల్లె, రామయ్యపల్లె ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అనంతరం డీసీసీ కార్యదర్శి ఎండీ రహీం తదితరులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, మాజీ కార్పొరేటర్లు కొలిపాక సుజాత, వెంగల పద్మలత, మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, డివిజన్ల అధ్యక్షులు ఈదునూరి రవి, బొడిగె భరత్గౌడ్, ఈదునూరి మల్లేశ్, కుంట భాగలక్ష్మి, అబ్దుల్లా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.