
యోగానందం
● నిత్య సాధనతో ఆరోగ్యం ● యోగాసనాలు వేస్తున్న జనం ● ఆరోగ్యస్పృహతో జీవనం ● నేడు యోగా దినోత్సవం
యోగా.. ప్రపంచం పాటిస్తున్న ఆరోగ్యసూత్రం. శరీరం.. మనసును ఒకతాటికిపై తెచ్చి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ప్రక్రియ. ప్రస్తుత ఉరుకులు.. పరుగుల జీవితంలో యోగా సాధన ఆరోగ్యమంత్రంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా తర్వాత ప్రజలు పూర్తిగా ఆరోగ్యస్పృహతో జీవిస్తున్నారు. నిత్యం ఆసనాలు వేస్తూ మానసికంగా.. శారీరకంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి పదేళ్ల క్రితమే జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
– వివరాలు 8లోu
పెద్దపల్లిలో యోగాసనాలు వేస్తున్న అశ్విని
యోగాతో నయమైంది
కరీంనగర్స్పోర్ట్స్: 2013 నుంచి 2016 వరకు అనారోగ్యంతో బాధపడ్డాను. యోగా చేయాలని పలువురు చెప్పడంతో ప్రతీ రోజు సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నాను.
– కె.వందన
ఆస్తమా, బీపీ పోయాయి
కరీంనగర్స్పోర్ట్స్: సర్వరోగ నివారణి యోగా అనే దానికి నేనే నిదర్శనం. యోగాసనాలు చేయకముందు బీపీ, ఆస్తమాతో బాధపడ్డాను. ఇక్కడ డేకేర్ సెంటర్కు వచ్చినప్పటి నుంచి అన్ని నయమయ్యాయి. ఇప్పుడు చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను.
– కె.అరుణ

యోగానందం

యోగానందం