
జవాబుదారీగా పని చేయాలి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): పోలీసుస్టేషన్కు వ చ్చి సమస్యలు చెప్పుకునే వారిపట్ల స్పందించి సమస్యను పరిష్కరిస్తే జనంలో మన్ననలు పొందుతా రని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషో ర్ ఝూ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్స్టేషన్, సర్కిల్ ఆఫీస్ ను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరసరాలను పరిశీలించడంతో పాటు రిసెప్షన్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసులు, రౌడీషీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, పెండింగ్ కేసుల ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలని, జవాబుదారీతనంగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బరెడ్డి, ఎస్సై శ్రావణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ