గిరిజనుల వికాసానికే పథకాలు | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల వికాసానికే పథకాలు

Jun 21 2025 3:45 AM | Updated on Jun 21 2025 3:45 AM

గిరిజనుల వికాసానికే పథకాలు

గిరిజనుల వికాసానికే పథకాలు

మంథనిరూరల్‌: గిరిజనుల వికాసానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో పీఎం ధర్తీ ఆబాజన్‌ జాతీయ ఉత్కర్ష అబియాన్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఆధార్‌, రేషన్‌, ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్‌ అకౌంట్‌, జాబ్‌ కార్డులాంటి పథకాల కోసం సదస్సులో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు అందిస్తామని వివరించారు. పోడు భూముల పట్టాలున్న గిరిజనులకు ముఖ్యమంత్రి ఇందిరా గిరిజన సౌరవికాస పథకం ద్వారా ఉచితంగా సౌర విద్యుత్‌మోటారు, డ్రిప్‌ సౌకర్యం అందిస్తున్నట్లు వెల్ల డించారు. ఇందుకు కనీసం ఐదెకరాల భూమి ఉండాలని, జిల్లాలో అంత విస్తీర్ణంలో ఒక్కరి వద్ద లేదని, ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు గిరిజన రైతులు కలిపి సంయుక్తంగా ఐదు ఎకరాల బ్లాక్‌ తయారు చేసి ఈ పథకం వర్తింపజేస్తామని తెలిపారు.

పనులు పూర్తి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మంథని పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, జేబీఎస్‌ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీవో సురేశ్‌, డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి, పీఆర్‌ ఏఈ అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement