దళారులను నమ్మి మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులను నమ్మి మోసపోవద్దు

Jun 21 2025 3:45 AM | Updated on Jun 21 2025 3:45 AM

దళారు

దళారులను నమ్మి మోసపోవద్దు

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌లో కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో జరిగిన దందా గతంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ చొరవతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతీయువకులకు కర్మాగారంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను కేటాయించేలా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. స్పందించిన అధికారులు కర్మాగారంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేశారు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు నాయకులు దళారుల అవతారమెత్తి రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారి దందాకు తెరలేపారు. కాగా, ఉద్యోగాల పేరుతో దళారులను నమ్మి మోసపోవద్దని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది.

దుబ్బ ఇసుక లారీల అడ్డగింత

ముత్తారం(మంథని): మండలంలోని ఓడేడు మానేరు పరివాహక ప్రాంతంలో పంట పొలాల్లోని ఇసుకమేటలను తరలిస్తున్న దుబ్బ ఇసుక లారీలను శుక్రవారం ముత్తారం, అడవి శ్రీరాంపూర్‌ చౌరస్తాలో స్థానికులు అడ్డుకున్నారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వందలాది లారీలు నడవడంతో దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరి అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము లేవకుండా సంబంధిత కాంట్రాక్టర్‌ కనీసం రోడ్డుపై నీరు కూడా చల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు అతివేగంగా వెళ్తూ మిగతా వాహనదారులకు సైడ్‌ ఇవ్వడం లేదని వాపోయారు. సుమారు గంట సేపు లారీలను రోడ్డుపై నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బత్తుల రాముడు, గోపగాని తిరుపతి, నగేశ్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

ప్రసూతి సేవలు సద్వినియోగం చేసుకోవాలి

మంథని: మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సీ్త్రవైద్య నిపుణురాలు అందుబాటులో ఉంటున్నారని, ప్రసూతి సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి అన్నారు. శుక్రవారం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసూతి సేవలపై ఆరా తీశారు.

ప్రైవేట్‌ ఆసుపత్రి తనిఖీ

సుల్తానాబాద్‌రూరల్‌: పెద్దపల్లిలోని రేని ఆసుపత్రిని శుక్రవారం డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు సరిగా నిర్వహించడం లేదని, కన్సల్టెంట్‌ సమయంలో డాక్టర్‌ పేర్లకు అనుగుణంగా అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఉన్నప్పుడే రెన్యూవల్‌ చేయడం జరుగుతుందని తేల్చి చెప్పారు.

దళారులను    నమ్మి మోసపోవద్దు1
1/2

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను    నమ్మి మోసపోవద్దు2
2/2

దళారులను నమ్మి మోసపోవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement