ఉద్యమానికి అధికారుల సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి అధికారుల సన్నద్ధం

Jun 17 2025 6:51 AM | Updated on Jun 17 2025 7:03 AM

కార్యాచరణ ప్రకటించిన సీఎంవోఏఐ

ముఖ్యమంత్రి దృష్టికి అధికారుల సమస్యలు

అయినా పరిష్కారం కాకుంటే 7 నుంచి వర్క్‌టూ రూల్‌

దశలవారీ పోరాటాలకు సింగరేణి అధికారుల ప్రణాళిక

పీఆర్‌పీ చెల్లింపులో ఆలస్యం

పీఆర్‌పీ చెల్లింపు ఇప్పటికే ఆలస్యమైంది. సంస్థ వ్యాప్తంగా అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉద్యోగులకు ఇస్తున్న విధంగా అధికారులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి. ఐఐటీ, ఐఐఎం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి. పదోన్నతుల్లో పారదర్శకత పాటించాలి. ఆర్గనైజేషన్‌ ప్యాటర్న్‌ ఏర్పాటు చేయాలి.

– లక్ష్మీపతిగౌడ్‌, అధ్యక్షుడు, సీఎంవోఏఐ

గోదావరిఖని: సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకత కో సం అహర్నిశలు శ్రమిస్తున్న తమకు గుర్తింపు లేకుండా పోతోందని అధికారులు వాపోతున్నారు. కోలిండియాలో పీఆర్‌పీ చెల్లించినా సింగరేణి పట్టించుకోవడం లేదంటున్నారు. ఈక్రమంలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈమేరకు కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(సీఎంవోఏఐ) సమావేశాన్ని స్థానిక యైటింక్లయిన్‌కాలనీలో ఆదివారం నిర్వహించిన అధికారులు.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ప్రధానంగా అధికారులకు రావాల్సి పీఆర్‌పీ(పెర్ఫార్మెన్స్‌ రిలే టెడ్‌ పేమెంట్‌) వెంటనే చెల్లించాలని కోరుతున్నా రు. పీఆర్‌పీ విడుదల చేయాలని గత మార్చి 8, 17 వ తేదీల్లో ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోతున్నారు. తమ పిల్లలకు ఉచిత విద్యుత్‌, ఐఐటీ/ఐఐఎం రీయింబర్స్‌మెంట్‌ అందించాలని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేదంటున్నారు. సంస్థపై గౌరవం, డైరెక్టర్ల సూచనల మేరకు ఇప్పటివరకు సామరస్యంగానే ముందుకెళ్తున్నా.. కోలిండియాలో అధికారులకు పీఆర్‌పీ చెల్లించడంతో తీవ్రఅంసతృప్తికి లోనవక తప్పడంలేదని అంటున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

● కోలిండియా యాజమాన్యం 2022–23 ఆర్థిక సంవత్సరం పీఆర్పీ గతేడాది జూన్‌లో చెల్లించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని పీఆర్పీని ఈనెల 25న విడుదల చేసేందుకు ఇటీవల ఆదేశాలు జారీచేసింది.

● హైకోర్టు 2007–08 నుంచి 2013–14 వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఆర్‌పీ విడుదలకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది.

● ఉచిత విద్యుత్‌, ఐఐటీ/ఐఐఎం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రయోజనాలు అధికారులకు వర్తింపజేయాలి.

● పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో పారదర్శక విధానం అమలు చేయాలి.

● ఆర్గనైజేషన్‌ ప్యాట్నర్‌ ఏర్పాటు చేయాలి.

ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు..

సమస్యల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారుల సంఘం నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు అందజేయాలని తీర్మానించారు. ఈనెల 23న సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని సిద్ధమవుతున్నారు. అయినా సమస్యలు పరిష్కారం కాకుంటే ఈనెల 24 నుంచి శాంతియుత పద్ధతిన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 24న నల్లబ్యాడ్జీలతో నిరసన, వచ్చేనెల 1న రిలేదీక్షలు, 7 నుంచి వర్క్‌టూ రూల్‌ విధానం అమలు చేసేందుకు నిర్ణయించారు.

సమస్యలు పరిష్కరించండి

సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసో సియేషన్‌ ఆఫీసర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారుల వేతనాల్లో భాగమై న 2022 – 23 పీఆర్‌పీ చెల్లింపు, ఉచిత వి ద్యుత్‌, ఐఐటీ, ఐఐఎం ఫీజురీయింబర్స్‌మెంట్‌, 2007 – 14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెర్క్స్‌ చెల్లించాలని వారు కోరారు. పా రదర్శకమైన పదోన్నతి పాలసీ, బదిలీలు ఉండాలని వారు విన్నవించారు. కార్యక్రమంలో ఆర్జీ –1 అధికారుల సంఘం అధ్యక్షుడు బి.మల్లేశం, జనరల్‌ సెక్రటరీ కోలా మల్లేశం, వైస్‌ ప్రెసిడెంట్‌ విష్ణుమూర్తి, అంజయ్య, దామోద ర్‌, అన్వేష్‌, అధికారులు పాల్గొన్నారు.

ఉద్యమానికి అధికారుల సన్నద్ధం 1
1/1

ఉద్యమానికి అధికారుల సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement