
సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పెద్దపల్లిరూరల్: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నిట్టూరు, తుర్కలమద్దికుంటలో సోమవారం ఆయ న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. కొన్నింటికి ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. తుర్కమద్దికుంటలో వి ద్యార్థులకు యూనిఫామ్స్ అందజేసి, అక్షరాభ్యా సం చేయించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాది రైతు ప్రభుత్వం
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కాంగ్రెస్ది రైతు ప్ర భుత్వం అని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. సుద్దాల, కనుకుల రైతువేదిల్లో చేపట్టిన వీడి యో కాన్ఫరెన్స్కు ఆయన హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సందేశాన్ని రైతులతో కలిసి ఎ మ్మెల్యే, అధికారులు వీక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, తహసీల్దార్ బషీరొద్దీన్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, నాయకులు సతీశ్, దామోదర్, సత్యనారాయణ, రాంరెడ్డి, సంపత్, అంజయ్య, సాయి, శ్రీనివాస్, మొగిలి, రాజేశ్ పాల్గొన్నారు.