
వేగంగా అభివృద్ధి పనులు
● కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లిరూరల్: పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అ భివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖపై కలెక్టరేట్లో సోమవారం ఏర్పా టు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. హెల్త్ సెంటర్లు, ఉప కేంద్రాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్ భవనాలు, ప్రహరీల నిర్మాణాలు, మరమ్మతులకు నిధులు మంజూరు చేశామని, పను లు సకాలంలో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన 5 తహసీల్దార్ భవన నిర్మాణాలను డిసెంబర్ వరకు పూర్తిచేయాలని, అధికారులు పర్యవేక్షించాల ని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పంచాయ తీరాజ్ ఈఈ గిరీశ్బాబు, సీపీవో రవీందర్, ఏవో శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేయండి
అందరూ రక్తదానం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష అన్నారు. 30సార్లు రక్తదానం చేసిన వైకే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయి కిశోర్కు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ అవార్డు ప్రకటించింది. ఈమేరకు కలెక్టర్ ఆయనకు అవార్డు అందజేసి మా ట్లాడారు. తనకు అవార్డు రావడం ఆనందంగా ఉందని సాయికిశోర్గౌడ్ తెలిపారు.
డివిజన్ల పునర్విభజనపై కలెక్టర్ సమీక్ష
కోల్సిటీ(రామగుండం): నగరంలో చేపట్టిన 60 డి విజన్ల పునర్విభజన ప్రక్రియపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆరా తీశారు. కమిషనర్ అరుణశ్రీ, ఏసీపీ శ్రీధర్తో కలిసి ఆయన పునర్విభజన ప్రక్రియను నేరుగా పరిశీలించారు. లింగాపూర్, వెంకటరావుపల్లె, ఎల్కలపల్లిగేట్, అక్బర్నగర్ గ్రామాలు బల్ది యాలో విలీనమైన నేపథ్యంలో వచ్చిన అభిప్రాయాలు, డివిజన్ల హద్దులు, మ్యాప్లపై నివేదిక త యారు చేయాలని ఆదేశించారు. ఈనెల 17, 18న పునర్విభజన నివేదికను కలెక్టర్ సమీక్షించాక 19న సీడీఎంఏకు నివేదించనున్నారు. 21న తుది నివేదికను విడుదల చేస్తారు. టీపీఎస్ నవీన్, రెవెన్యూ అధికారి ఆంజనేయులు, ఆర్ఐ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ల పునర్విభజన పారదర్శకంగా, శాసీ్త్రయంగా చేపట్టాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ప్రతినిధి దినేశ్ కలెక్టర్కు విన్నవించారు.
అంతర్గాం రైతువేదికలో..
రామగుండం: అంతర్గాం రైతువేదికలో చేపట్టిన రైతేనేస్తం కార్యక్రమానికి కలెక్టర్ శ్రీహర్ష హాజరయ్యా రు. తహసీల్దార్ రవీందర్పటేల్ పాల్గొన్నారు. అనంతరం రామగుండం జెడ్పీహైస్కూల్ అదనపు తరగతి గదుల పనులను కలెక్టర్ పరిశీలించారు.