
సీబీఎస్ఈ స్కూల్లో ప్రవేశాలు ప్రారంభం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏ రియా యైటింక్లయిన్కాలనీ సెక్టార్–3 సింగరే ణి పాఠశాలలో సీబీఎస్ఈలో సోమవారం ప్ర వేశాల ప్రక్రియ ప్రారంభించారు. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకోసం ఇప్పటికే దరఖస్తు చేసుకున్న వారికి ఇ టీవల దశలవారీగా పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలను ఆదివారం ప్రకటించారు. జాబితా ను స్కూల్ నోటీస్ బోర్డుపై అతికించారు. దీంతో జాబితాలో తమ పిల్లల పేర్ల కోసం తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సీట్లు వ చ్చినవారు ఈనెల 16 నుచి 18 వ తేదీ వరకు ప్రవేశాలు తీసుకోవాలని హెచ్ఎం సుందర్రా వు తెలిపారు. ఖాళీగా ఉన్న 408 సీట్ల భర్తీకి సింగరేణి కార్మిక, ప్రభావిత ప్రాంతాల పిల్లల నుంచి 1,600 దరఖాస్తులు అందాయి. అందు లో సుమారు 90 శాతం మంది సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు కేటాయించారు. ఈనెల 18లోగా ప్రవేశం తీసుకోకుంటే సీటు రద్దు అవుతుందని హెచ్ఎం వివరించారు.
యోగా సాధనతో ఆరోగ్యం
రామగిరి(మంథని): ప్రతీరోజు యోగా సాధన చేయడం ద్వారా వ్యాధులు దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఆర్జీ–3 జీఎం నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించు కుని సోమవారం 16 నుంచి 21 వరకు గనులు, విభాగాల్లో చేపట్టిన యోగాభ్యాస కార్యక్రమా న్ని జీఎం ప్రారంభించారు. వారితో యోగాసనాలు చేశారు. యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ వెంకటరమణ, గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధి సంతోష్కుమార్, ఫై నాన్స్ ఏజీఎం శ్రీనివాసులు, ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ సుదర్శనం, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పారదర్శకంగా రోడ్డు పనులు
రామగిరి(మంథని): కల్వచర్ల గ్రా మంలో చేపట్టిన సీసీరోడ్ల పనుల్లో పారదర్శకత పా టించాలని పంచాయతీరాజ్ డీ ఈ నవీన్ సూ చించారు. మంత్రి శ్రీధర్బాబు చొరవతో రూ. 1.60 కోట్ల వ్యంతో చేపట్టిన రోడ్ల పనులను సోమవారం ఆ యన పర్యవేక్షించారు. ఒకవైపు కట్టడాలను తొ లిగిస్తూ, మరోవైపు నిలిపివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ కోసం రెండు వైపులా కట్టడాలు తొలిగించాలని పంచా యతీ కార్యదర్శి శ్రీధర్ను ఆదేశించారు. కారోబార్లు కనకయ్య, శ్రావణ్ పాల్గొన్నారు.
బలగాలను వెనక్కి పంపించాలి
గోదావరిఖని: కేంద్ర బలగాలను వెనక్కి పంపించి, మావోయిస్టులతో చర్చలు జరపాలని అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రధాన చౌరస్తా నుంచి భాస్కర్రావు భవన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకుల హత్యాకాండను కేంద్రప్రభుత్వం ఆపేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందుగానే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని రామగుండం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఐఎఫ్టీయూ తదితర విప్లవ సంఘాల నాయకులు కె.విశ్వనాధ్, టి.రత్నకుమార్, గుర్రం విజయ్కుమార్, ఆరెల్లి కృష్ణ, కుమారస్వామి, మాదాసు రామ్మూర్తి, మల్లన్న, బాలసాని రాజన్న, తాండ్ర సదానందం, మిట్టపల్లి కుమారస్వామి, నాగిరెడ్డి, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

సీబీఎస్ఈ స్కూల్లో ప్రవేశాలు ప్రారంభం

సీబీఎస్ఈ స్కూల్లో ప్రవేశాలు ప్రారంభం

సీబీఎస్ఈ స్కూల్లో ప్రవేశాలు ప్రారంభం