విజయనగరం టౌన్: జిల్లా పోలీసు శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పని చేస్తున్న బిఎస్ఎన్.మూర్తి ఇటీవల తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లో జరిగిన 11వ ఆల్ ఇండియా పోలీసు జూడో క్లస్టర్ 2026–2027 తైక్వాండో పూమ్సే పోటీల్లో బంగారు పతకం సాధించినట్లు ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం పేర్కొన్నారు. 2027 మార్చిలో ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచ పోలీసు అండ్ ఫైర్ గేమ్స్కు ఎంపికయ్యారన్నారు. అనంతరం అతని కోచ్ జి.రాజేష్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఎస్.రాము, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


