● వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో ఉండకూడదు. మెరుపు కనిపించిన తర్వాత 30 సెకెన్లు, అంత కన్నా తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలోపు పిడుగు పడే అవకాశం ఉంది. ● మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు. ● గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోనులు లేకుండా చూసుకోవాలి. సెల్ఫోన్ ఉంటే స్విచ్ఆఫ్ చేయాలి. వర్షం కురిసే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. – డాక్టర్ బి.ప్రదీప్కుమార్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం


