
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విశ్రాంత బ్యాంక్ మేనేజ
లక్కవరపుకోట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఎస్ఎన్ రాజుకు ఆరుదైన కరెన్సీ నోట్లు సేకరించడం అలవాటు. అరుదైన కరెన్సీ నోట్లు సేకరించినందుకు గాను 2025వ సంవత్సరానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఆయన స్థానం సాధించారు. అంతేకాకుండా ఒకేసారి ఆయన మూడు లిమ్కా రికార్డులు సాధించడం విశేషం. ప్రతి కరెన్సీ నోటుపై ఒక రకమైన సిరీస్ నంబర్ కలిగిన నోట్లు సుమారు 12 వందలు సేకరించినందుకు ఒక రికార్డు, అలాగే కరెన్సీ ముద్ర సమయంలో పొరపాటు జరిగితే ఆ నోటుకు బదులు వేరే నోటు ముద్రిస్తారు.ఆ విధంగా ముద్రించిన నోట్పై స్టార్ గుర్తు పెడతారు. అలాంటి స్టార్ నోట్లు సుమారు 11వందల నోట్లు సేకరించి మరో రికార్డును నమోదు చేశారు. ఇంకా కరెన్సీ నోట్పై సీరియల్ నంబర్లు ఆరు డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఏడో డిజిట్ ఉన్న నోట్లు చాలా అరుదుగా వస్తాయి. అలా ఏడు డిజిట్స్ ఉన్న నోట్లను సేకరించి మూడో రికార్డు సాధించారు. మొత్తంగా ఒకే సారి మూడు లిమ్కా రికార్డులను సాధించిన ఆయనను పలువురు అభినందించారు.
అరుదైన కరెన్సీ నోట్లు సేకరించి రికార్డు

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విశ్రాంత బ్యాంక్ మేనేజ

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విశ్రాంత బ్యాంక్ మేనేజ

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విశ్రాంత బ్యాంక్ మేనేజ

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విశ్రాంత బ్యాంక్ మేనేజ