దళితుల భూముల దురాక్రమణపై విచారణ | - | Sakshi
Sakshi News home page

దళితుల భూముల దురాక్రమణపై విచారణ

Jun 16 2025 6:57 AM | Updated on Jun 16 2025 6:57 AM

దళితు

దళితుల భూముల దురాక్రమణపై విచారణ

లక్కవరపుకోట: మండలంలోని మల్లివీడు దళితులకు సంబంధించిన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించుకోవడంతో మండల రెవెన్యూ అధికారి కె. సన్యాసిరావు ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ నిర్వహించారు. భూముల ఆక్రమణ వ్యవహారంపై సాక్షి పత్రికలో ‘దళితల భూముల దురాక్రమణ’ శీర్షికన ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కొత్తపల్లి సన్యాసిరావు, వీఆర్‌ఓ పూర్ణిమ, తదితరులు స్పందించి ఆ భూముల వద్దకెళ్లి విచారణ జరిపారు. ఈ భూములు ప్రభుత్వ గెడ్డ వాగుభూమికి సంబంధించినవని అధికారులు తెలిపారు. తహసీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు విశాఖపట్నంలో జరగనున్న యోగా డే కార్యక్రమానికి వెళ్లారని, ఆయన వచ్చి విచారణ చేపట్టేవరకు ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టరాదని ఆర్‌ఐ సన్యాసిరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం సాగులో ఉన్న దళితల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్ద పెదిరెడ్ల వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

దళితుల భూముల దురాక్రమణపై విచారణ1
1/1

దళితుల భూముల దురాక్రమణపై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement