
●పిల్లలను తరలిస్తే ఊరుకోం
బలిజిపేట: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెదపెంకి దళితపేట ప్రాథమిక పాఠశాల–1లో చదువుతున్న 3, 4, 5 తరగతుల పిల్లలను మోడల్ స్కూల్కు తరలించడం అన్యాయమంటూ పాఠశాల వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. దళితపేటలో సుమారు 800 కుటుంబాలు నివసిస్తున్నాయి. కూలి పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వృద్ధులు, బందువులకు పిల్లలను అప్పగిస్తాం. ఆ సమయంలో దూర ప్రాంతంలోని పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లి, తేవడం కష్టం. పాఠశాల కమిటీ సమావేశం జరపకుండా, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకాభిప్రాయంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మా పిల్లలను వేరే పాఠశాలకు పంపిచేది లేదని తెగేసి చెప్పారు. ఊరి బడిని నిర్వీర్యం చేసే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు నల్ల ఈశ్వరరావు, దళితపేటవాసులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలి
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ
విజయనగరం అర్బన్: గిరిజన ప్రాంతాల్లో రేషన్ సరఫరాను పాత ఎండీయూ విధానంలో కొనసాగించాలని, లేదంటే ప్రత్యేక రేషన్ డిపోలను ఏర్పాటుచేసి సరుకులు సరఫరా చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ తీసుకోవడంలో గిరిజనుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ శుక్రవారం మాట్లాడారు. ప్రస్తుతం రేషన్ తీసుకోవడంలో గిరిజనులు పడు తున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లయి కమిషనర్కు ఎస్టీ కమిషన్ లేఖ రాసిందన్నారు. ఎండీయూ విధానాన్ని ఆపడంవల్ల గిరిజనులు వ్యయప్రయాసలకు గురవుతు న్నారని, ఏజెన్సీలో ఇంటింటికీ రేషన్ సరఫరా విధానం కొనసాగించాలని కోరారు.