మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ

Jun 13 2025 4:49 AM | Updated on Jun 13 2025 4:49 AM

మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ

మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ

జిల్లావ్యాప్తంగా 19,741 బస్తాల సరఫరా

పార్వతీపురంటౌన్‌: పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లాలోని 1,504 పాఠశాలలకు 5,184 బస్తాలను, 150 వసతి గృహాలకు 13,456 బస్తాల ఫోర్టిఫైడ్‌ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం స్థానిక డీవీఎంఎం స్కూల్లో ఫైన్‌క్వాలిటీ ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా విద్యా శాఖాధికారితో కలిసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు బియ్యాన్ని పంపిణీ చేశారు.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే వివరాలు

ఈ సందర్భంగా ఫోర్టిఫైడ్‌ సన్నబియ్యం బస్తాపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి బస్తాపై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దాన్ని స్కాన్‌ చేయగానే బియ్యం ఏ సీజన్‌లో పండింది? పండించిన రైతు, చేరుకున్న రైతు సేవా కేంద్రం, బియ్యం రకం, ఏ రైస్‌ మిల్లులో మరపట్టా రు? చేరుకున్న స్టోరేజీ గోదాము, రైస్‌ వచ్చిన ప్రాంతం, ధ్రువీకరించిన సాంకేతిక సిబ్బంది, ప్యాకింగ్‌ ఏజెన్సీ పేరు తదితర వివరాలు తెలుసుకునే అవకా శం ఉందన్నారు. ఈ విధంగా పంపిణీ చేయడం వల్ల ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సరుకు పంపిణీ అవుతాయన్నా రు. జిల్లాకు పాలకొండలోని వెంకటేశ్వర రైస్‌ మిల్‌ నుంచి బియ్యం ప్యాకింగ్‌ అయి వచ్చినట్లు తెలిపా రు. ఇకపై సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నామని, విద్యార్థులు తప్పనిసరిగా ఈ పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఐ.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్‌కుమార్‌, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వారణాసి శ్రీధరరావు, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement