
కార్పొరేట్ల సేవలో ప్రభుత్వం
విజయనగరం గంటస్తంభం: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ షైనింగ్ స్టార్ అవార్డుల ఎంపికలో ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఉద్దేశించి భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి డి.రాము, సీహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుల పేరుతో 20వేల రూపాయల, నగదు, సర్టిఫికెట్, అవార్డుతో సత్కరించింది. సోమవారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులకు ఎంపికై న వారికి అందజేశారు. దీనికి గాను ప్రతి మండలం నుంచి ఓసీకి ఇద్దరు, బీసీకి ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరిని ఎంపిక చేసి మండలానికి ఆరుగురికి చొప్పున అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డులకు ఎంపికై న ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో 29 మంది ప్రైవేట్ విద్యాసంస్ధల నుంచి ఉంటే 17 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసిన వారున్నారు. పాఠశాలలకు సంబంధించి మొత్తం 158 మందిలో 65 మంది ప్రైవేట్ పాఠఽఽశాలల నుంచే ఎంపికయ్యారు. ఈ రకమైన అవార్డులు ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఒకే ప్రమాణాలు పాటించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోయి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా, సిలబస్ పూర్తిగా అవకుండా, అరకొర సౌకర్యాల మధ్య చదువు సాగించి అత్యధిక మార్కులు పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ షైనింగ్ అవార్డ్స్ ఇవ్వకపోవడం వారి కష్టాన్ని విస్మరించడమేనన్నారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ప్రతి మండలంలో ఓసీ ఇద్దరు, బీసీ ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరిని చొప్పున ఎంపిక చేయాలి. కానీ విజయనగరం జిల్లాలో ఈ ఎంపిక విషయంలో అన్నాయం జరిగిందని ఆరోపించారు. 580 మార్కులు వచ్చిన ఓసీ కేటగిరికి చెందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఎంపిక చేసి అదే 580 మార్కులు వచ్చి ప్రభుత్వ పాఠఽశాలల్లో చదువుకున్నప్పటికీ వెనుకబడిన తరగతుల విద్యార్థిని ఎంపిక చేయకపోవడం సామాజిక బాధ్యతను విస్మరించడం అవుతుందన్నారు. కాబట్టి ఇప్పటికై నా ఈ అవార్డులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు..ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు.
వారికే షైనింగ్ అవార్డ్స్ కేటాయింపు
ధ్వజమెత్తిన ఎస్ఎఫ్ఐ నాయకులు