కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

Jun 10 2025 7:10 AM | Updated on Jun 10 2025 7:10 AM

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

మెంటాడ:మండలంలోని బిరసాడవలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న కోళ్ల ఫారాన్ని తక్షణమే తరలించాలని కోరుతూ ఆ గ్రామస్తులు కోళ్లఫారం ఎదుటు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు అయిదో రోజు సోమవారం కొనసాగాయి. వీరికి పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలుపుతున్నారు. నాలుగో రోజు ఆదివారం నిరాహార దీక్ష శిబిరానికి ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. తక్షణమే కోళ్ల ఫారాన్ని తరలించాలని డిమాండ్‌ చేశారు. ఈ కోళ్ల ఫారం వల్ల బిరసాడవలసతో పాటు చుట్టు పక్క అయిదు గ్రామాలకు చెందిన ప్రజలు రోగాల పాలవుతున్నారని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వైస్‌ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, నాయకులు రెడ్డి రాజప్పలనాయుడు, జనసేన నాయకులు సబ్బవరపు రాజశేఖర్‌ పాల్గొన్నా రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement