సూక్ష్మంతోనే.. దిగుబడులకు మోక్షం..! | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మంతోనే.. దిగుబడులకు మోక్షం..!

Jul 31 2025 7:44 AM | Updated on Jul 31 2025 9:05 AM

సూక్ష్మంతోనే.. దిగుబడులకు మోక్షం..!

సూక్ష్మంతోనే.. దిగుబడులకు మోక్షం..!

ఖరీఫ్‌ వరినారులో కనిపిస్తున్న సూక్ష్మధాతు లోపం

సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలు

మట్టి పరీక్ష: నేలలో ఏ సూక్ష్మధాతువు లోపించిందో తెలు సుకునేందుకు పంటకాలం ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి.

ఎరువుల యాజమాన్యం:మట్టిపరీక్ష ఫలితాల ఆధారంగా సూక్ష్మధాతువులను అందించే ఎరువులను అందించాలి.

పచ్చిరొట్ట పైర్లసాగు: సూక్ష్మధాతు లోపాల నివారణ కు సేంద్రియ వ్యవసాయ విధానాలు మేలు చేస్తా యి. ఇందులో ప్రధానంగా పంట సీజన్‌ ప్రారంభంలో కుళ్లిన పశువుల గత్తం, వర్మీ కంపోస్టును భూమి లో చల్లుకొని కలియదున్నాలి. జీలుగు, పిల్లిపెసర, నవధాన్యాల సాగువంటి విధానాలతో పచ్చిరొట్ట పైర్లను పెంచి దమ్ము సమయంలో వీటిని భూమిలో కలియదున్నాలి. దీనికి అదనంగా ఎకరానికి కనీసం 100 కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్పేట్‌ను పైపాటుగా వేసుకుంటే పచ్చిరొట్ట పైరును బాగా కుళ్లిస్తుంది. దీనిద్వారా ఆ భూమిలో సేంద్రియ కర్బనంతో పాటుగా సూక్ష్మధాతువుల స్థిరీకరణకు సహాయపడుతుంది.

వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి.

ఇనుము: ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇను ము ఆధారం. ఇది పిండి పదార్థం తయారీకి ఉపయోగపడుతుంది. అధిక క్షార భూముల్లో, సున్నపు రాయి పాలు ఎక్కువగా గల నేలలు, తేలిక నేలల్లో, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో ఇనుప దాతు లోపాలు కనిపిస్తాయి. మెట్టవరి, మెట్ట నారుమళ్లలో ఇనుప దాతులోపం సాధారణంగా కనిపిస్తుంది.

నివారణ చర్యలు: ఒక లీటర్‌ నీటికి 20 గ్రాముల అన్న భేది, రెండు గ్రాముల నిమ్మ ఉప్పులో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక మిగతా సూక్ష్మ పోషకాలు తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. మార్కెట్లో అన్ని సూక్ష్మ పోషకాల మిశ్రమం ఆగ్రోమినిమార్క్స్‌ రూపంలో ఫార్ములా–4 రూపంలో లభ్యమవుతాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని బట్టి పైరులో వీటిని తగిన సమయంలో వాడి అధిక దిగుబడి పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement