
విజయోత్సవ సభ వీక్షణం
కొరాపుట్: ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్లు సాధించిన విజయాలపై జయపూర్లో ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం జరిగింది. జయనగర్ చిల్డ్రన్ పార్క్ సమీపంలో ప్రధాని నరేంద్రమదీ రాష్ట్ర రాజధానిలో జరిగిన అధికారిక కార్యక్రమాన్ని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. స్థానికంగా ప్రభుత్వం తరఫున జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరం సశ్యా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత హాజరయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఇందిరా లక్ష్మీ పండా కుటుంబాన్ని ఇదే కార్యక్రమ వేదికపై యెగా క్షేమాలు అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో జయపూర్ ప్రజలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

విజయోత్సవ సభ వీక్షణం