రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం

Jun 21 2025 3:55 AM | Updated on Jun 21 2025 3:55 AM

రాష్ట

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం

బీజేపీ ఏడాది పాలన పూర్తి మహోత్సవ వేదికపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్ర గవర్నరు తదితర ప్రముఖులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

భువనేశ్వర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ నేతృత్వంలో ఒడిశా సుపరిపాలన సంవత్సరం వేడుకల్ని జరుపుకుంటోందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు మోహన్‌ చరణ్‌ మాఝి అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు. స్థానిక జనతా మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో బీజేపీ పాలన తొలి ఏడాది పూర్తి వార్షికోత్సవ సభలో శుక్రవారం ప్రధాన మంత్రి ప్రసంగించారు. గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, ఆయన బృందం అద్భుతమైన పనితీరును ప్రదర్శించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ దక్షత ఒడిశాలో సుపరిపాలన సంవత్సరంగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు. తొలి ఏడాది పాలనలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సేవతో ప్రజా ప్రభుత్వంగా ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకోవడంపై దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఒడిశా ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసి రాష్ట్రానికి మరింత ఉజ్వలమైన, జవాబుదారీ భవిష్యత్తుకు పునాది వేసిందని ఆయన ప్రోత్సహించారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తుందని ప్రధాన మంత్రి ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వ భావి కార్యాచరణ ప్రణాళిక సంచికని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

2036 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒడిశా ఏర్పడి శతాబ్ది పూర్తి చేసుకునే సందర్భంగా, 2047లో భారత దేశం స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తి సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రోడ్‌మ్యాప్‌ సంచిక రూపు దిద్దుకుంది. 2036 నాటికి ఒడిశాను 500 బిలియన్ల యూఎస్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 1.5 ట్రిలియన్ల యూఎస్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం ఈ విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యంగా పేర్కొన్నారు.

జీ 7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా అధికారిక పర్యటన తర్వాత వాషింగ్టన్‌కు రావాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానాన్ని తిరస్కరించి రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ పాలన ఏడాది పూర్తి ఉత్సవానికి హాజరైనట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్ర శాసన సభ స్పీకరు సురమా పాఢి ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు. వార్షికోత్సవం ప్రాంగణం వరకు నిర్వహించిన రోడ్డు షో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటితో పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం1
1/3

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం2
2/3

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం3
3/3

రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement