‘విశ్రాంతి గృహానికి స్థలమివ్వాలి’ | - | Sakshi
Sakshi News home page

‘విశ్రాంతి గృహానికి స్థలమివ్వాలి’

Jun 21 2025 3:55 AM | Updated on Jun 21 2025 3:55 AM

‘విశ్రాంతి గృహానికి స్థలమివ్వాలి’

‘విశ్రాంతి గృహానికి స్థలమివ్వాలి’

జయపురం: దక్షిణ ఒడిశాలో ప్రసిద్ధి చెందిన గుప్తేశ్వర్‌ శివ క్షేత్రంలో రాత్రులందు భక్తులు ఉండేందుకు ఒక విశ్రాంతి గృహం నిర్మించేందుకు 15 సెంట్ల స్థలం కేటాయించాలని బొయిపరిగుడ సమితి రామగిరి పంచాయతీ పూజారి పుట్‌, మాలిగుడ, అటల్‌గుడ, బదుడిపహాడ్‌, అంబొచందిలి, కలియజులి, మండుకఝొరణ, గదబగుడ, బాగ్‌ఝోల, పురాణ పాని, గెల్లాగుడ, మాలిపొదర్‌, జమేల్‌బెడ, దండకొల ఆదివాసీ యువకులు సబ్‌ కలెక్టర్‌ అక్కవరం శొశ్యారెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. వారు సబ్‌ కలెక్టర్‌కు ఒక వినతి పత్రం సమర్పించారు. గుప్తేశ్వర ప్రాంతంలో చుట్టు పక్కల గ్రామాలలో నివసించే గుప్తేశ్వరుని భక్తులు రాత్రిళ్లో గుప్తేశ్వరంలో ఉంటున్నారని, వారికి ఎలాంటి సదుపాయం లేదని, విశ్రాంతి గృహానికి స్థలం కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement