
ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన
మల్కన్గిరి: ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మోటు ప్రాంతంలో మాక్డ్రిల్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ముఖ్యంగా బాదిలి, గిరకానపల్లి, మోటు, ధుంగియాపూట్ ప్రాంతాల్లో వరద ఆశ్రయ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధన్, ఎమర్జెన్సీ అధికారి ప్రపుల్ల బేహేరా గిరకానపల్లి ఆశ్రయ కేంద్రాలను సందర్శించారు. జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి కూడా ఉన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించే ముందు , తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచకుని ప్రజలు తమ ధన, జీవనాన్ని రక్షించుకోవడానికి, ఇతరులను సురక్షితంగా ఉంచేందుకు అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండేలా అవగాహన కల్పించారు. అగ్నిమాపిక సిబ్బంది వరదలు, తుఫాన్, మెరుపులు, గర్జన, భూకంపం, పాముకాటు సంభవించే విపత్తులపై ప్రాథమిక చికిత్స, రక్షణ పద్ధతుల ప్రదర్శణ చేశారు. విపత్తు సమయంలో గ్రామస్థాయిలో ఎలర్ట్ టీమ్, రెస్క్యూ టీమ్, నష్టఅంచనా, సహయకేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.

ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన

ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన