
నేడు యోగా దినోత్సవం
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా శిబిరం శనివారం ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ తెలియజేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు రిజిస్ట్రేషన్, యోగా భ్యాసం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ యోగా దినోత్సవానికి పతంజలి యోగా సమితి జిల్లా ప్రభారి భిఘ్నేశ్వర్ దాస్ బృందం జిల్లాలో పర్లాకిమిడితో పాటు చంద్రగిరి, నువాగడ, గుమ్మా, ఆర్.ఉదయగిరిల్లో యోగా శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. దీనికోసం గత నెల రోజులుగా పతంజలి యోగా సమతి సభ్యులు యోగాభ్యాసాలు చేస్తున్నారన్నారు.
మద్యం అరికట్టాలని ఫిర్యాదు
కొరాపుట్: తమ ప్రాంతంలో మద్యం అరికట్టాలని నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్కి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కి చందాహండి సమితి మెహర్ గ్రామ పంచాయతీ బారిగుడ గ్రామస్తులు శుక్రవారం తరలివచ్చారు. తమ గ్రామంలో అక్రమ మ ద్యం తయారీ, విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వాపోయారు. దీనివలన విద్యా ర్థులు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తామ ఎకై ్సజ్ శాఖకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. దీనికి తగిన ఆధారాలతో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జలంధర్ మజ్జి తదితరులు ఉన్నారు.
ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్టు
గార: మండలంలోని సిలగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరుగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6600 స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ ఎం.చిరంజీవి తెలిపారు. కాగా, పట్టుబడిన వారిలో మండలానికి చెందిన ఒక వీఆర్వో కూడా ఉన్నట్లు సమాచారం.
శ్రీకాకుళం రూరల్: చాపురం పంచాయతీ రామిగెడ్డ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతుండగా 8 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.4వేలు రికవరీ చేసినట్లు చెప్పారు.
జాయింట్ పట్టాదారుల
విభజనకు ప్రత్యేక డ్రైవ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా వెబ్ల్యాండ్–2.0లో నమోదైన రైతులు ప్రభుత్వ పథకాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శుక్రవారం తెలిపారు. రెవెన్యూ శాఖ సాధారణంగా వసూలు చేసే రూ.500 రుసుము మినహాయించి రూ.50 నామమాత్రపు రుసుముతో జాయింట్ పట్టాల విభజ న చేసేందుకు వీలు కల్పించామని పేర్కొన్నారు. జూన్ 30లోపు గ్రామ సచివాలయాల ద్వారా దరఖా స్తు చేసుకోవాలన్నారు. భూవివరాల విభజన అనంతరం అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇతర పథకాల కోసం రైతులు అర్హులుగా పరిగణిస్తారని జేసీ స్పష్టం చేశారు. ఇప్పటికే పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాయింట్ పట్టాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవలో అర్హత కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. పేద రైతులకు ఇది గొప్ప అవకాశమని, జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలోని అనివెట్టి మండపంలో కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన ఓంకార్ అకాడమీ గురువు చిత్రా త్యాగరాజన్ శిష్యులు మండా వెంకట నిషాల్ శుక్రవారం భరతనాట్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు యోగా దినోత్సవం

నేడు యోగా దినోత్సవం