
ఆశా కార్యకర్తల సమ్మె నోటీసు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు మంజూరు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయా లని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో అంతా పాల్గొనా లని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయు డు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.అనితకు సమ్మె నోటీసు అందజేశారు. పేదలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న తమకు కార్మికులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాల ని విన్నవించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.