రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం

Jun 18 2025 3:13 AM | Updated on Jun 18 2025 3:13 AM

రాష్ట

రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం

భువనేశ్వర్‌: పూరీ జగన్నాథుని వార్షిక రథయాత్రకు విచ్చేయాలని కోరుతూ శ్రీమందిరం ముఖ్య నిర్వాహకుడు (సీఏవో) డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ పాఢి రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా స్థానిక రాజ్‌భవన్‌న్‌లో కలిసి గవర్నర్‌కు ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు.

మృతుల కుటుంబాలకు

పరిహారం అందజేత

కొరాపుట్‌: రిజర్వాయర్‌ మృతులకు పరిహారాలు ప్రభుత్వం అందజేసింది. మంగళవారం కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితి భానురు గ్రామానికి వెళ్లి రూ.10 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేశారు. జోలాపుట్‌ రిజర్వాయర్‌ దలైపుట్‌ ఘాట్‌ వద్ద పుష్ప బైరాగి (15), దేవేంద్ర కిర్సాని (17)లు ప్రమాదవాశాత్తు ఆదివారం మునిగి చనిపోయారు. దీంతో వీరి కుటుంబాలకు రెడ్‌క్రాస్‌ ఆర్థిక సాయం చేసింది. కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ వి.కీర్తివాసన్‌ ఆదేశాల మేరకు నందపూర్‌ తహసీల్‌ ఇన్‌స్పెక్టర్లు సోమనాథ్‌ ముదలి, పార్వతి పర్జాలు ఆర్థిక సాయం అందించారు.

గంజాయి స్వాధీనం

రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంలో గంజాయితో ఒక యువకుడు అబ్కారీ శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. నిందితుడు సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన మనోజ్‌ మాఝిగా గుర్తించారు. అతడి వద్దనుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టుకు తరలించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అబ్కారీ శాఖ ఐఐసీ బిజయ్‌ కుమార్‌ బెక్‌, ఏఎస్‌ఐ మనిక్‌ చంద్ర గౌడో, ఆర్పీఎఫ్‌ పోలీస్‌ సరోజ్‌ కుమార్‌ బారిక్‌లు రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫారం నంబర్‌ ఒకటిలో అనుమానాస్పదంగా కనిపించిన మనోజ్‌కు సంబంధించిన బ్యాగులు తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది.

200 సీట్లకు 1009 దరఖాస్తులు

జయపురం కేంద్రీయ విద్యాలయంలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి

జయపురం: జయపురంలో కొత్తగా ఏర్పాటైన కేంద్రీయ విద్యాలయంలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 200 సీట్లను కేటాయించగా.. 1009 మంది దరఖాస్తు చేసుకున్నారని విద్యాలయం ప్రిన్సిపాల్‌ హరిహర పండ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ భవనంలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహిస్తారు. ఈ నెల రెండు నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సంబంధిత అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది ఒకటి ఐదవ తరగతి వరకు పాఠ్య బోధన ప్రారంభిస్తారు. ఒక్కో తరగతిలో 40 చొప్పున ఐదు తరగతులకు 200 సీట్లు కేటాయించారు. అయితే ఒకటో తరగతి కోసం 261 మంది, రెండో తరగతి కోసం 223, మూడో తరగతికి 216, నాలుగో తరగతికి 129, ఐదో తరగతికి 180 మంది దరఖాస్తులు పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌, జయపురం సబ్‌కలెక్టర్లకు సమర్పిస్తామన్నారు. ఈ నెల 22, 23 తేదీలలో సీట్లను కేటాయించి విద్యాలయంలో విద్యార్థులను చేర్చుకుంటామన్నారు. జూలై ఒకటవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం 1
1/2

రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం

రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం 2
2/2

రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement