తైలమర్దన | - | Sakshi
Sakshi News home page

తైలమర్దన

Jun 17 2025 6:49 AM | Updated on Jun 17 2025 6:49 AM

తైలమర

తైలమర్దన

జగన్నాథుడికి..
● ఐదు రోజులుగా గోప్యంగా ఉపచారాలు ● శ్రీమందిరంలో కొనసాగుతున్న సంప్రదాయాలు

భువనేశ్వర్‌: పూరీలో శ్రీక్షేత్రం జగన్నాథ రథయాత్ర సన్నాహాలతో సందడిగా మారింది. తెరచాటున జగతినాథునికి గోప్య సేవలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. యాత్రకు సకాలంలో సిద్ధం కావాలని స్వామి, వెను వెంటనే స్వామిని కనులారా దర్శించుకోవాలని భక్తజనం ఉవ్విళ్లూరుతున్నారు. ఐదు రోజులుగా శ్రీమందిరం రత్న వేదికపై నిత్యం దర్శనం కల్పించే చతుర్థామూర్తులు చీకటి గదిలో గోప్య ఉపచారాలు పొందుతున్నారు. జ్యేష్ట పూర్ణిమ సందర్భంగా విశేష స్నానం ఆచరించిన శ్రీ జగన్నాథుడు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు సోదరుడు బలభద్ర స్వామి, సోదరి సుభద్ర దేవి జ్వరం బారిన పడి తెరమరుగయ్యారు. ఈ క్రమంలో దేవదేవుళ్లకు దైతపతి సేవకులు గోప్యంగా పలు ఉపచారాలు అందజేస్తున్నారు.ఉపశమనం కోసం 5వ రోజున ఆచారం ప్రకారం ఫులురి మూలిక తైల మర్దన చేశారు. దీనిని శ్రీ అంగ సేవగా పేర్కొంటారు.

తైలమర్దన 1
1/2

తైలమర్దన

తైలమర్దన 2
2/2

తైలమర్దన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement