మూడు వాహనాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

మూడు వాహనాలు స్వాధీనం

Jun 17 2025 6:49 AM | Updated on Jun 17 2025 6:49 AM

మూడు వాహనాలు స్వాధీనం

మూడు వాహనాలు స్వాధీనం

మల్కన్‌గిరి: ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న దొంగను మల్కన్‌గిరి జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎ ఈ నెల రెండో తేదీన స్థానిక ఐఎమ్‌ఎస్‌టీ పాఠశాల వద్ద నివసిస్తున్న ప్రకాష్‌ బర్మన్‌ అనే వ్యక్తికి చెందిన బైక్‌ చోరీకి గురైంది. దీనిపై మూడో తేదీన మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీన స్థానిక ఎడ్యుకేషన్‌ కాలనీకి చెందిన భవానీ శంకర్‌ జేనా తన బైక్‌నుంచి ఇంటి ముందు పార్క్‌ చేయగా చోరీకి గురైంది. ఆయన కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఈ నెల రెండో తేదీ రాత్రి ఎం.వి.42 గ్రామంలో భవతోష్‌ విశ్వష్‌ అనే వ్యక్తి బైక్‌ ఇంటి ముందు ఉంచగా చోరీకి గురైంది. ఆయన కూడా మూడో తేదీన మల్కన్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఐఐసీ రీగాన్‌ కీండో పట్టణంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ ఇంటి ముందు ఒకవ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్టు నేరం అంగీకరించాడు. నిందుతునిది కలిమెల సమితి జగన్నాథ్‌ వీధికి చెందిన సీతల్‌ పైక్‌ అలియస్‌ రింకు పైక్‌గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్టు ఐఐసీ రీగాన్‌ కీండో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement