
గుణుపూర్లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో సొమవారం కలెక్టర్ ఫరూల్ పట్వారి గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 28 వినతులను స్వీకరించారు. ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.35 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్దీప్ కౌర్ సహాట, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
మల్కన్గిరి: కలిమెల సమితి ఎం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలో తమాన్పల్లి పంచాయతీ ఎం.వి.113 గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. అలాల్ రోజో సందర్భంగా అమాల్ మాండాల్ అనే వ్యక్తి బైక్పై భార్యపిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య కవిత అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఐఐసీ చంద్రకాంంత్ తండి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
మల్కన్గిరి: కోరుకొండ సమితి సోమనాథ్పూర్ పంచాయతీ ఎం.వి.36 గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. బలిమెల నుంచి ఇంద్రావతి వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని బలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
క్షతగాత్రునికి సపర్యలు
కొరాపుట్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సపర్యాలు చేసి మానవీయత చాటారు యువకులు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా సమీపంలో వాగ్దేవి వంతెన వద్ద ఖిల్గుడ గ్రామానికి చెందిన తిలక్ కుమార్ అనే ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిని గుర్తు తెలియని వాహనం ఆదివారం సాయంత్రం ఢీకొట్టి వెళ్లి పోయింది. తీవ్ర రక్తస్రవంతో తిలక్ రోడ్డు పక్కన పడి ఉన్నాడు. విషయం తెలిసి పాడువకి చెందిన విశ్వనాఽథ్ మహంతి, షేక్ రహీం, శశిధర్ నాయర్, లాలులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని సమీప ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అతని వద్ద ఉన్న రూ. ఏడు వేలు నగదు, బంగారు గొలుసు, చెవి పోగులు, ఇతర బంగారు ఆభరణాలు, మూడు సెల్ ఫోన్లను భద్రపరిచి వాటిని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితుడు ముత్తుట్ ఫైనాన్స్లో పని చేస్తూ పాడువ వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలకుతరలించారు. క్షతగాత్రుడుని రక్షించి మానవీయత చూపించిన పాడువ యువతను పోలీసులు అభినందించారు.

గుణుపూర్లో వినతుల స్వీకరణ

గుణుపూర్లో వినతుల స్వీకరణ

గుణుపూర్లో వినతుల స్వీకరణ