
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
పర్లాకిమిడి: బాల కార్మిక వ్యవస్థను నిర్యూలించాలని వ్యక్తలు అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బాలకార్మికుల విముక్తిపై చైతన్య పాదయాత్రను జిల్లా ఆదనపు మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో చైతన్య రథంతో పాటు, వివిధ పాఠశాలల విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలో పలు కూడళ్లలో వివిధ షాపులు, ఎస్టాబ్లిస్మెంట్లలో బాలకార్మికులను పనిలో పెట్టుకోరాదని అవగాహన కల్పించారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కార్మిక శాఖ అధికారిణి భారతీ బెహారా హెచ్చరించారు. బాలకార్మికుల వ్యవ్యస్థ విముక్తి కోసం జిల్లా అంతటా చైతన్య పాదయాత్రలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి